schedule Friday, September 04, 2026

స్పందించిన విద్యుత్ అధికారులు

calendar_today May 28, 2026
person Prajagalam News
స్పందించిన విద్యుత్ అధికారులు
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పరిధిలో అల్లాపూర్ (బి) గ్రామంలో ఆరు రోజులు గడిచిన త్రీఫేస్ అంతరాయం ఏర్పడిన విద్యుత్ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని కన్జామర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అనే శీర్షిక ప్రచురించబడింది,నేడు విద్యుత్ అధికారులు స్పందించి అల్లాపూర్ (బి) గ్రామంలో త్రీఫేస్ విద్యుత్ తీగలు మరమత్తు చేసి లైన్ మెన్ అనిల్ త్రాగునీటి బోరు కనెక్షన్ ఇచ్చి గ్రామ ప్రజలకు త్రాగునీటి సమస్యనీ తీర్చడం జరిగిందని అన్నారు.అదేవిధంగా బషీరాబాద్ లో జయంతి కాలనీలో వీదురుగాళ్లకు విరిగిపడ్డ చెట్టును విద్యుత్ అధికారులు లైన్ మెన్ ఉమేష్ తొలగించి కన్జ్యూమర్లు లకు విద్యుత్ సరఫరా అందించడం జరిగింది అన్ని అన్నారు.విద్యుత్ అధికారులకు కన్జమర్లు సహకరించాలని తెలిపారు.