అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ పరిగి బ్లాక్ బి అధ్యక్షుడు కర్రె భరత్ కుమార్
June 11, 2026
Prajagalam News
(ప్రజాగళం, కుల్కచర్ల)
పేద ప్రజలకు ఆపత్కాలంలో అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ పరిగి బ్లాక్ బి అధ్యక్షుడు కర్రె భరత్ కుమార్ అన్నారు.గురువారం కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన బైండ్ల బుడ్డయ్య అకాల మరణం చెందారని తెలుసుకొని అంత్యక్రియల నిమిత్తం తన వంతు సహాయంగా 3000 రూపాయలు కుమారుడు ఎల్లయ్యకు అందజేశారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగని ఎల్లయ్య, మాజీ మండల ప్రధాన కార్యదర్శి బైండ్ల బాలకృష్ణ రావు,సాలేటి రవికుమార్, నాగని మొగులయ్య,బైండ్ల బాబు,మేకుల భీమ్ సేన్,దొమ్మ వెంకట్ తదితరులు ఉన్నారు.