రైతులు పంట వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి :-కుల్కచర్ల ఏఈఓ భావన
September 2, 2026
Prajagalam News
కుల్కచర్ల:-
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలంటే రైతులు తాము పండించే పంటల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని ఏఈఓ భావన అన్నారు.
బుధవారం కుల్కచర్ల మండలంలో రైతుల వ్యవసాయ పొలాల్లో పంటల వివరాలను నమోదు ప్రక్రియను పరిశీలించారు.ప్రతి గ్రామంలో పంటల వివరాల నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, స్థానిక ప్రజాప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిజిటల్ క్రాప్ట్ సర్వేయర్ శావకు ముకుంద,రైతులు పాల్గొన్నారు